POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 12:43 pm Posted by : POLITICAL POWER

అక్షరాస్యతతోనే సమాజ అభివృద్ధి – ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలి

–  అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోసెప్టెంబర్.09.2026.అంతర్జాతీయఅక్షరాస్యతదినోత్సవాన్నిపురస్కరించుకునిమంగళవారంవనపర్తిపట్టణంలోనిజెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాల నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.ఈ సందర్భంగావిద్యార్థులుఅక్షరాస్యతప్రాముఖ్యతనుతెలియజేస్తూప్లకార్డులుప్రదర్శిస్తూ,నినాదాలుచేస్తూర్యాలీలోపాల్గొన్నారు.ఈసందర్భంగాఅదనపు కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాస్యత ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగులునింపడంతోపాటుకుటుంబ, సామాజిక, ఆర్థికఅభివృద్ధికిదోహదపడుతుందని పేర్కొన్నారు.సమాజంలోఅక్షరాస్యతశాతాన్నిమరింత పెంచేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని ఆమె సూచించారు. చదువు ద్వారా వ్యక్తుల్లో అవగాహన, ఆత్మవిశ్వాసం పెరిగి, తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకునే అవకాశం కలుగుతుందనితెలిపారు.ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించడంతోపాటుచదువుకుదూరంగాఉన్నవారినికూడాఅక్షరాస్యులుగాతీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలనిఅదనపు కలెక్టర్.ఖిమ్యానాయక్,పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో డీఈవో యాదయ్య, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.