POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 9:39 pm Posted by : POLITICAL POWER

అభివృద్ధి పథంలో వైరా ని ఇంకా ముందు తీసుకెళ్తాను అంటున్న ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి మంద లక్ష్మీనారాయణ జూలూరుపాడు జూన్12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి వసతులను మరింత మెరుగుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వైరా నియోజకవర్గానికి అభివృద్ధి పరంగా ముందుకు సాగుతుందని ఏనుకూరు మండలంలోని ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రారంభిస్తున్నామని మరియు అదేవిధంగా ఐటిఐ కాలేజ్ మరియు ఏనుకూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని అత్యాచినేక పరికనాలతో వైద్య సేవలు మెరుగుపరిచామని అదేవిధంగా వ్యవసాయము వైద్యం పెద్దపీట వేశామని వారన్నారు వ్యవసాయ రంగానికి అవసరమైన నీటి అవసరాలను బట్టి సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుండి వైరా రిజర్వాయర్కు నీటిని తరలిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా మండలాల్లోని రైతులకు చిన్న, పిల్ల కాలువల ద్వారా సాగునీటిని అందిస్తూ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వైరా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు వ్యవసాయ రంగంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అల్లాడి నరసింహారావు ఏన్కూర్ మార్కెట్ చైర్మన్ లచ్చునాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్, దుద్దుకూరి మధుసూదన్ రావు, వేల్పుల నరసింహారావు, రామిశెట్టి రాంబాబు, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.