POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 8:16 pm Posted by : POLITICAL POWER

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా నాయకులు అప్రమత్తంగా ఉండాలి 

–  కొత్తకోట టౌన్ మండల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు (సర్) ప్రక్రియలో పాల్గొనాలి,
– దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక వనపర్తి జిల్లా బ్యూరో 10.జూలై 2026.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా నాయకులు అప్రమత్తంగా ఉండాలని, కొత్తకోట టౌన్ మండల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు (సర్) ప్రక్రియలో పాల్గొనాలని,దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.కొత్తకోట మండలం, టౌన్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో,ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) పై పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి బూత్‌లో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలించాలని  సూచించారు.18ఏళ్లునిండినకొత్తఓటర్లనునమోదుచేయించి,మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లు తొలగించాలన్నారు.దొంగఓట్లు,తప్పుడునమోదులులేకుండాపారదర్శక ఓటర్ల జాబితా రూపొందించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జ్‌లు సమన్వయంతో పనిచేసి(ఎస్.ఐ.ఆర్)100.శాతంపూర్తిచేయాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే ఎన్నికల్లో విజయం సులువుతుందని  స్పష్టం చేశారు. పేర్లు తొలగింపుపైనిర్లక్ష్యం‌వహిస్తేసహించేదిలేదని.పేదలఓట్లుపోకుండాచూడాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు, ఓటర్ జాబితా ప్రక్షాళనను (సర్) లైటుగా తీసుకుంటే కటిన చర్యలు ఉంటాయని తెలిపారు, ప్రజాప్రతినిధులుపార్టీనాయకులుబాధ్యతాయుతంగావ్యవహరించాలనిసూచించారు.అర్హులైనప్రతిఒక్కరికిఓటుహక్కు కల్పించేలా. నాయకులు అప్రమత్తంగా ఉండాలనిఆదేశించారు.కాంగ్రెస్,ప్రభుత్వసంక్షేమపథకాలనుప్రజల్లోకితీసుకెళ్లాలనిప్రజాప్రతినిధులకు,నాయకులకు,కార్యకర్తలకుతెలిపారుస్థానిక సమస్యల పరిష్కారానికిప్రాధాన్యంఇస్తూప్రజలకుఅందుబాటులోఉండాలన్నారు.రానున్నస్థానికసంస్థలఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధంచేసుకోవాలని సూచించారు. మండలంలోని అభివృద్ధి, సంక్షేమ పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు, త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.