POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 7:12 pm Posted by : POLITICAL POWER

ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను కలిసిన నియోజకవర్గంలోని గోదాము యజమానులు

గోదాములు నిర్వహణకు సహకారం అందించాలని ఎమ్మెల్యేకి వినతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 25 2026: మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ను హైదరాబాదులో కలిసిన మైదుకూరు నియోజకవర్గం పరిధిలోని గోదాముల యజమానులు. మైదుకూరు నియోజకవర్గం గోదాముల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించిన అసోసియేషన్. గోదాములలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించిన యజమానులు. రైతులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని యజమానులకు తెలియజేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ సుబ్రహ్మణ్యేశ్వర యాదవ్ యజమాని తోట సురేష్, టివిఆర్ గోడౌన్ యజమాని రామ్మోహన్ రెడ్డి. భార్గవి గోడౌన్ యజమాని రామచంద్రారెడ్డి, గురు విజయలక్ష్మి వేర్హౌస్ యజమాని గోపిరెడ్డి శేఖర్ రెడ్డి, గాయత్రి వేర్హౌస్ యజమాని వివి స్వామి, ఎంఎం వేర్హౌస్ యజమాని కరిముల్లా, జయచంద్ర, ఎన్ఎస్ గోడౌన్ యజమాని షేక్ మున్న తదితరులు కలిసి సత్కరించారు.