పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణ: ఈ సారి ఎల్నినో ముప్పు తీవ్రంగా ఉంటుందని, ఇప్పటికే రిజర్వాయర్లలో జలాలు అడుగంటడంతో పంటలకు నీళ్లిచ్చే పరిస్థితి లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు వస్తాయనే ఆశతో రైతులు వరి నాట్లు వేయొద్దని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడే రైతులు కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టి ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టాలని పేర్కొన్నారు.