ePaper
Thursday, September 17, 2026
📄 ePaper

ఎల్ నీనో ప్రభావిత హై రిస్క్ ప్రాంతాల్లో ఏపీఎంఐపీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మురళి మోహన్ రెడ్డి విశ్రుత పర్యటన

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్

ఎల్‌నినో ప్రభావిత,హైరిస్క్ ప్రాంతాల్లో రైతులకు సాగునీటి పొదుపు, పంటల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఏపీఎంఐపీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ సిరిగిరెడ్డి మురళీమోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు.వేముల మండలంలోని నల్లచెరువుపల్లి,కొండ్రెడ్డిపల్లి,నారేపల్లి తదితర గ్రామాలతో పాటు తొండూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం పర్యటించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని వివిధ పంట పొలాలను పరిశీలించిన ఆయన,ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి సాగునీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.ముఖ్యంగా సూక్ష్మ సేద్యం,డ్రిప్ పరికరాల వినియోగం ద్వారా తక్కువ నీటితో పంటలకు అవసరమైన తేమను అందించవచ్చని వివరించారు.డ్రిప్ పరికరాల పనితీరు,వినియోగ విధానం,పంటలకు కలిగే ప్రయోజనాలపై రైతులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.డ్రిప్ పరికరాలు అవసరమైన రైతులను గుర్తించి అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టి,వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు.అనంతరం రైతులతో నిర్వహించిన సమావేశాల్లో మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావిత, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో రైతులు నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.డ్రిప్ పద్ధతిలో నీటిని నేరుగా మొక్కల వేర్లకు అందించడం వల్ల నీటి వృథా తగ్గడంతో పాటు పంటలకు సమర్థవంతంగా నీరు అందుతుందని తెలిపారు.రైతులు సూక్ష్మ సేద్య పద్ధతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ పర్యటనలో ఏపీఎంఐపీ సిబ్బంది నాగేష్,సంబంధిత అధికారులు,రైతులు పాల్గొన్నారు.

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు, దస్త్రాలు లేకుండా ఎస్టీల భూములపై దౌర్జన్యం చేసే వారిపై పీ.డీ.యాక్ట్ పెట్టాలి.✓ ఫ్రీ హోల్డ్ చట్టంతో ఎస్టీల భూముల ను...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం తండా నందు సోషల్ మీడియా కన్వినర్  అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి. ఎస్ మక్బూల్ ఈ కార్యక్రమంలో...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న వైస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి. ఎస్ మక్బూల్ *
error: Content is protected !!