కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన వనపర్తి ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 25 2026: కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బోస్ రాజు ను తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చాంబర్లో సోమవారం మంత్రి శ్రీహరి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలియజేశారు. అనంతరం నీటిపారుదల శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.