*కాపవరం, బలభద్రపురంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం*
రైతులంతా రైతు ఐడి పొందాలి.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంబిక్కవోలు మండలం కాపవరం, బలభద్రపురం గ్రామాల్లో ఈరోజుపొలంపిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిక్కవోలు మండల వ్యవసాయ అధికారి జి. వాణి మాట్లాడుతూ రైతులందరూ తమ పొలాలను ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్లో నమోదు చేసుకుని రైతు గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. భవిష్యత్తులో ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లకు రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి కానుందని తెలిపారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో పంటల నమోదు ప్రక్రియ జరుగుతోందని, రైతులందరూ తమ పంట...