పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి తుమ్మల సుడా (SUDA) మాజీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోసూరి రమేష్ గౌడ్ మృతి పట్ల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆవేదన చెందారు. రమేష్ మృతి కాంగ్రెస్ పార్టీకే కాక తనకు వ్యక్తి గతంగా తీరనిలోటని తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు త్రి టౌన్ ఏరియా పార్టీ కో-ఆర్డినేటర్ యర్రం బాలగంగాధర్ తిలక్ అధ్యక్షతన కోసూరి రమేష్ స్వగృహంలో సంతాప సభ జరిగింది. సంతాపసభ రమేష్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసింది . ఖమ్మం నగరంలోని కోసూరి స్వగృహానికి వెళ్లి నివాళులర్పించిన తుమ్మల మాట్లాడుతూ… రమేష్ ఆది నుంచి తన వెంటే ఉంటూ మంచి రాజకీయ నాయకుడిగా పేరుందారన్నారు. నిరాడంబర జీవితం గడిపిన రమేష్ నిగర్వి అన్నారు. రమేష్ గౌడ్ మరణం పార్టీకి , స్థానిక ప్రజలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు . రమేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కష్ట సమయంలో భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు గుండె నిబ్బరాన్ని, మనో ధైర్యాన్ని ప్రసాదించాలని తుమ్మల ఆకాంక్షించారు. మంత్రి తుమ్మలతో పాటు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పలువురు నాయకులు, బంధు మిత్రులు అందరు రమేష్ గౌడ్ సంతాప సభలో ప్రసంగించారు . రమేష్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు. రమేష్ మృతి తమ అందరికీ తీరని లోటు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఖమ్మం కార్పోరేషన్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి ఖాదర్ బాబా, మాజీ మేయర్ పూనకొల్లు నీరజ మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .