POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 8:29 pm Posted by : POLITICAL POWER

క్రమశిక్షణ పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు..

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రిపోర్టర్ ఏం. ప్రసాదరావు.కలసపాడు కడప జిల్లా. బద్వేల్ తాలూకాలోని కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో చదివి ఉత్తమ ఫలితాలను సాధించి ఇంటర్మీడియట్ విజయవాడలో పూర్తిచేసుకుని అక్కడ జేఈఈ నీట్ పరీక్షలకు హాజరై అందులో ఉత్తమ ఫలితాలను సాధించిన సాయి, అభి అనే విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ రాజశేఖర్ రెడ్డి, మరియు ప్రిన్సిపల్ చిత్త ప్రభావతి, శాలువా పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రాజశేఖర్ రెడ్డి, మాట్లాడుతూ విద్యార్థులు అనునిత్యం చదువు తో పాటు క్రమశిక్షణ, ఓర్పుతో సహనముతో చదివినప్పుడు దేనినైనా సాధించవచ్చు అని తెలిపారు.