POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 5:42 pm Posted by : POLITICAL POWER

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి

– ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోండి, మండపాలను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి,

–డిజేలకుఅనుమతిలేదు,ఎలాంటిఅవాంఛనియాసంఘటనలుజరగకుండాజాగ్రత్తలుతీసుకోవాలి,గణేష్ ఉత్సవాల కమిటీ సమావేశంలో సీఐ ఓడి రమేష్,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.10.2026.గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని, ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని, మండపాల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని సీఐ ఓడి రమేష్ అన్నారు. బుధవారం జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎస్సై విక్రమ్ తో కలిసి గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ మండపాల దగ్గర డిజేపెడితేచట్టపరమైనచర్యలుతప్పవనిహెచ్చరించారు. డిజేలకు అనుమతి లేదని నిబంధనలు ఎవరైనా ఉల్లంగిస్తే వారిపై చర్యలుతీసుకోవడంజరుగుతుందని తెలిపారు.గణేష్,మండపాలదగ్గరఫైర్,కుసంబందించిన వస్తువులను అందుబాటులోఉంచుకోవాలనిగణేష్ నిమజ్జనంవివరాలుకచ్చితంగాపోలీస్,స్టేషన్లోఇవ్వాలని అన్నారు. ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండానిర్వాహకులుతగుజాగ్రత్తలుపాటించాలని సూచించారు. మండపాల దగ్గర పెట్టె సౌండ్ సిస్టమ్ వల్ల పక్కవారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని సౌండ్ కాస్త తగ్గించి పెట్టాలని చెప్పారు.పలుకాలనిలోవాహనాలకుతీవ్రఇబ్బందులు ఉంటాయని గణేష్ లను ఖాళీ స్థలలో పెట్టాలని రోడ్ల మీద పెట్టి వాహనాలకు ఇబ్బందులు కలిగించొద్దని హెచ్చరించారు. గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేవరకు పోలీసులకు నిర్వాహకులుసహకరించాలనిఅన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.