అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్ ఎన్ వి ఆర్ 9 టీవీ ఆర్సి వెంకటేష్)* సెప్టెంబర్ 13 ములకలపల్లి మండలం గ్రామం సత్తుపల్లి బ్రాంచ్ నందు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు బీమా అందజేయడం జరిగింది… ములకలపల్లి మండలం రాజుపేట గ్రామానికి చెందిన గుంజ ఆదినారాయణ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 50,000/- రూ తీసుకోవడం జరిగింది.. తీసుకున్న ఆరు నెలల సమయంలోనే గుండెపోటుతో గుంజి ఆదినారాయణ మృతి చెందడం జరిగింది కావున వారి కుటుంబానికి చెందిన నామిని గుంజ నాగమణికి, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు అక్షరాల 806403/- లక్షల రూపాయలు చెక్కు రూపంలో నామినీకి ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిaa ఎ జి ఎం సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి.. కుటుంబ ఆర్థిక భద్రతకు బీమా అవసరం జీవితంలో ఎప్పుడు ఎలాంటి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేమని, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు జీవిత బీమా ఎంతో అవసరమని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అధికారులు తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యుల భవిష్యత్ అవసరాలు, పిల్లల విద్య, కుటుంబ నిర్వహణ తదితర ఖర్చులకు బీమా ఆర్థికంగా అండగా నిలుస్తుందని వివరించారు. అలాగే భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బీమా పథకాలను ఎంచుకోవడం, పాలసీ నిబంధనలు మరియు ప్రయోజనాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పాలసీ తీసుకోవడం ముఖ్యమని సూచించారు. బీమాను కేవలం పెట్టుబడిగా కాకుండా కుటుంబానికి ఆర్థిక రక్షణ కవచంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.జీ.ఎం. సతీష్, డీఎం భరత్, మేనేజర్ శ్రీనివాసరావు, ఎంప్లయర్ నరేష్, డి ఓ వెంకటేశ్వరావు, శ్రీనివాసరావు, ఏజెంట్లు రవి, వెంకటరమణ, చంద్రకళ, రామారావు, సురేష్, బిక్షం, నరేష్, ఖాదర్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…
