పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: పెద్దమందడి వెల్టూరు గ్రామ సమీపంలోని ఎన్హెచ్-44 రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలిజపల్లి గ్రామానికి చెందిన కొంగల రవి (50), తండ్రి రాములు, రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెద్దమందడి ఎస్ఐ పి. జలంధర్రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.