POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 7:46 pm Posted by : POLITICAL POWER

గ్రామ పాలనా అధికారి నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన

-నెల రోజులైనా కుల ధ్రువీకరణ పత్రం దరఖాస్తులకు పరిష్కారం లేదు

పొలిటికల్ పవర్ సామాగ్ర తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ బాద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలో గ్రామ పాలనా అధికారి బి. పూర్ణ చందరావు విధులు నిర్వహిస్తున్నారు. అయితే కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్) కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నెల రోజులు దాటినా సంబంధిత దరఖాస్తులను పరిశీలించి ముందుకు పంపడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, సమస్యపై వివరణ కోరేందుకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, ఫోన్ కాల్స్ ఎత్తడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, దరఖాస్తుల పురోగతిపై సరైన సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. కొంతమంది దరఖాస్తుదారులు సమర్పించిన అప్లికేషన్లు కనిపించడం లేదని, వాటి స్థితిగతులు తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. దీంతో కుల ధ్రువీకరణ పత్రాలు ఆలస్యం కావడంతో విద్య, ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.ప్రజలకు అందుబాటులో లేని గ్రామ పాలనా అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.