
//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 19, 2026:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం, జడ్.పి.హెచ్.ఎస్ సురారం పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును
జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనినా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగాఈ అవార్డు అందుకున్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. లలిత అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు తదితర ప్రముఖుల సమక్షంలో వెంకటేశ్వర్లు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు.
విద్యార్థుల విద్యాభివృద్ధి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యం, విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డుతో సత్కరించారు.
ఈ సందర్భంగా గంగిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “ఈ అవార్డు నాకు ఎంతో ఆనందాన్ని, మరింత బాధ్యతను కలిగించింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో పనిచేస్తాను” అని తెలిపారు.
ఈ అవార్డు జెడ్ పి హెచ్ ఎస్ సురారం పాఠశాలకు, మహదేవ్పూర్ మండలానికి మరియు మొత్తం జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యా సమాజానికి గర్వకారణంగా నిలిచింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు ఆనందంగా ఉందన్నారు