POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 8:02 am Posted by : POLITICAL POWER

జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యునికి ఆర్థిక సాయం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు12.2026.

జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యుడు  రామస్వామి డయాలసిస్ తో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్లో చూయించుకొని తిరిగి ఇంటికి వచ్చిన సందర్భంగా జై భారత్ వాకింగ్ గ్రూప్ ఉపాధ్యక్షులు అయిన రామస్వామి అనారోగ్యానికి గురి కావడంతో జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షులు జె యం.మీ షేక్ ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యులు అందరూ కలిసి 16.వెల రూపాయలు గ్రూప్ తరఫున మానవత దృక్పథంతో అతనికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షులు జె యం.మీషేక్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసుకొని ఒకరికొకరు సంభాషణలు చేసుకొని ఆనందించే సమయంలో తోటి మిత్రుడు అనారోగ్యానికి గురైన సందర్భంగా చాలా బాధాకరంగా ఉందని, కుటుంబంలో ఒకరు ఇబ్బందులు పడితే కుటుంబమే ఇబ్బందులు పడుతుందని, గ్రూపులో సభ్యుడు ఇబ్బందులకు గురి కావడంతోతొందరగాకోలుకొనిగ్రూపులోకలిసిపోవాలని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో   కిషన్ నాయక్, ఈశ్వర్, రామస్వామి,  వీరనరసింహ చారి, లక్ష్మయ్య, లక్ష్మయ్య బాబాయ్, కృష్ణయ్య గౌడ్,  గంగాధర్, బాలరాజు, చంద్రయుడు, కురుమయ్య, భాస్కర్, సుల్తాన్, నాగరాజు, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.