పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ మాజీ ఉప ప్రధాని దళితుల మహానుభావుడు .బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమానికి. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. లేళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… భారతదేశానికి మూడు పర్యాలు కేంద్ర మంత్రిగా దేశ ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు అందించారని ఆయన కొనియాడారు.1971 లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో ఆయన రక్షణ మంత్రిగా ఉండి భారత బలగాలను అప్రమత్తం చేసి ఆరోజు దేశానికి ప్రాణ నష్టం జరగకుండా కాపాడారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు మోదుగు రామకృష్ణ. పోతురాజు నాగరాజు. మాజీ ఉపసర్పంచ్. దేవరకొండ కిరణ్. మంద సురేష్. ఎలకపల్లి నరేష్. పనితి వెంకటేశ్వర్లు. పత్తిపాటి మోహన్. అరుణ్.నారపోగు చిన్న నరసింహారావు. మంద దేవేందర్. పోతురాజు ఆనందరావు. నారపోగు పెద్ద నరసింహారావు.కొండ్రు మహేష్. మంద రమేష్. మంద కిషోర్. గోలి ప్రకాష్. తదితరులు పాల్గొన్నారు.