POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 8:28 pm Posted by : POLITICAL POWER

ఢిల్లీలో యువత, విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మాలోత్ నెహ్రూ నాయక్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /ఎన్‌వీఆర్ న్యూస్ డోర్నకల్, జూలై 25 2026: ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన మాలోత్ నెహ్రూ నాయక్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కుల కోసం గొంతెత్తిన యువత, విద్యార్థులతో చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన కేంద్ర ప్రభుత్వం, బలప్రయోగానికి దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. యువతే దేశ భవిష్యత్తు అని చెప్పుకునే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వారి సమస్యలను పరిష్కరించకుండా అణచివేత చర్యలకు పాల్పడటం బాధాకరమని ఆయన అన్నారు. నిరసనలో గాయపడిన విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షిస్తూ, యువత గొంతును గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాలోత్ నెహ్రూ నాయక్ కోరారు.