పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 06 2026: పెద్దమందడి మండల ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు కార్యక్రమం తపస్ నాయకులు గురువారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా తపస్ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన శశివర్ధన్ (తపస్ నాయకులు) మాట్లాడుతూ… ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన 6 డి ఏ, పిఆర్సి లను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టిఈటీ పరీక్షలో ఉత్తీర్ణత శాతాన్ని అన్ని సామాజిక వర్గలకు 40 % శాతం మార్కులు పెట్టాలని కేజీబీవీ లో పనిచేసే ఉపాధ్యాయినీల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈశ్వర్, రవికుమార్, రవి, నర్మద, బాలకృష్ణ, తిరుపతి పాల్గొనడం జరిగింది.