దమ్మపేటలో పామాయిల్ గెలల చోరీ.. టన్నుకు పైగా ఎత్తుకెళ్లిన దుండగులు

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 9:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండి గ్రామ సమీపంలో పామాయిల్ గెలల చోరీ కలకలం రేపింది. దమ్మపేటకు చెందిన రైతు కంభంపాటి సూరిబాబుకు చెందిన పామాయిల్ తోటలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చొరబడ్డారు. తోటలోని గెలలను నరికి ఆటోలో టన్నుకు పైగా గెలలను ఎత్తుకెళ్లినట్లు బాధిత రైతు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో తోటల్లో కాపలా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం...