పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ శనివారం కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి ప్రకటన విడుదల చేశారు. నీట్ పేపర్ లీకేజీ తో విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భరించలేని విద్యార్థిని విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ నడి వీధుల్లో నెలల తరబడి పోరాట రూపాన్ని దాల్చారు. విద్యార్థుల డిమాండ్లకు దిగివచ్చిన బిజెపి ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ఈ రాజీనామా విద్యార్థిని విద్యార్థుల పోరాట త్యాగాల ఫలితంగా సాధించారని చరిత్రలో మైలురాయిగా మిగిలిపోతుందని వారి త్యాగాలను షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ అభినందిస్తూ ఏపోరాటానికైనా త్యాగాల ఫలితం విజయాలను కాంక్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.