POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 7:35 pm Posted by : POLITICAL POWER

పీఆర్సీ వెంటనే అమలు చేయాలి.. టీఎస్ యూటీఎఫ్ డిమాండ్

సత్తుపల్లి హైస్కూల్‌ను సందర్శించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు

పీఆర్సీ వెంటనే అమలు చేసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

పొలిటికల్ పవర్ దినపత్రిక / పియన్9 టివి తెలుగు న్యూస్, సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి బుధవారం రోజు మంగళవారం టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్.కె. రంజాన్ సత్తుపల్లిలోని హైస్కూల్‌ను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు, మాజీ జిల్లా కార్యదర్శి చెరుకు శ్రీనివాసరావు, అధ్యక్షులు సూరయ్య, ప్రధాన కార్యదర్శి అశోక్ చక్రవర్తి, ఎఫ్‌డబ్ల్యూఎస్ కన్వీనర్ ఐ. నాగేశ్వరరావు, ట్రెజరర్ మధుసూదన్‌రావు, ఎం. రమేష్, కోటేశ్వరరావు, నిరంజన్, మహిళా కార్యదర్శులు పుష్పశిరీష, నాగమణి, అనసూయ, సుజని, భాగ్యలక్ష్మి, లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎస్‌జీటీ సభ్యులు అనసూయ, సుజని, టి. పుష్పశిరీష, ఎస్. నాగమణి, పి. లక్ష్మీకాంతమ్మ, జి. భాగ్యలక్ష్మి, హెచ్. సూరయ్య, కె. అశోక్ చక్రవర్తి, ఐ. నాగేశ్వరరావు, ఎం. మధుసూదన్‌రావు, ఎం. రమేష్, ఎస్‌ఏ (తెలుగు) చెరుకు శ్రీనివాసరావు, ఎస్‌ఏ (ఇంగ్లిష్), డి. ఉమామహేశ్వరరెడ్డి (ఎస్‌ఏ సోషల్), నిరంజన్ (ఎస్‌జీటీ), కోటేశ్వరరావు (ఎస్‌ఏ తెలుగు), రంజాన్, జిల్లా బాధ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.