పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 23.2026. వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని కానాయపల్లి గ్రామంలో ఈ నెల 26 న జరగనున్నపోషమ్మపండగసందర్బంగా పోషమ్మ గుడి అలంకరణకు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి 20 వేలు ఆర్థికసాయాన్ని అందజేశారు. గ్రామ యాదవ కమిటీ సభ్యులకు మాజీ సర్పంచ్ యాదయ్య చేతుల మీదుగా సాయాన్ని అందజేశారు. అదేవిదంగా సర్పంచ్ బొంతం శిరీష సాయి కూడా 5 వేలు ఆర్థికసాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బాజ గిరన్న, బందెన్న, బిఆరెస్ గ్రామ అధ్యక్షులు హోటల్ రాజు, రవీందర్ గౌడ్, ధనుష్, చిన్న రాములు యాదవ్, కొత్తకోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.
