POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 4:28 pm Posted by : POLITICAL POWER

ప్రతి ఒక్కరూ తల్లి పేరుమీద మొక్కలు నాటాలి

oplus_2
oplus_2 
– పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాద్యులుకావాలి,
– వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి,
–  ఆడపిల్లలు బాగా చదువు కొన్నప్పుడే వాళ్ళు తన కాళ్ళపై నిలబడుగుతారు,
– మహబూబ్ నగర్ పార్ల మేంట్ సభ్యురాలు డి కె.అరుణ,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి
న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20.2026.
ప్రతి ఒక్కరూ తల్లి పేరుమీద మొక్కలు నాటాలని,
పర్యావరణపరిరక్షణకుప్రతిఒక్కరూబాద్యులుకావాలని,వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని,ఆడపిల్లలు బాగా చదువు కొన్నప్పుడే వాళ్ళు తన కాళ్ళపై నిలబడుగుతారని మహబూబ్ నగర్ పార్ల మేంట్ సభ్యురాలు డి కె.అరుణ అన్నారు. శనివారం దేవరకద్ర నియోజకవర్గoలోని కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ముఖ్య అతిథులు పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి వాటికి నీరు పోశారు.అనంతరం పదవ తరగతి విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరు మాతృ పేరు మదచెట్లను నాటాలని చేపట్టిన కార్యక్రమాన్ని అందరంకలసి కలిసి కట్టుగా చేపట్టాలని అన్నారు.ప్రకృతి సమతుల్యతకు చెట్లు ఎంతో ముఖ్యమని, మంచి వర్షాలు కురవాలంటే విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సుమారు 24 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందని, దానిని 33 శాతానికి పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. విద్యార్థులు తమ పేర్లపై మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. జిల్లాకు నిర్దేశించిన 24 లక్షల మొక్కల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుంబిగించి మొక్కలు నాటాలన్నారు.విద్యార్థులు బాగా చ‌దువుకుని భవిష్యత్తులో ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గాల‌న్నారు. గతంలో మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో నే కులమతాలు, భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా చదువుకున్నామని చెప్పారు.
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పుడే వాళ్లు తన కాళ్ళపై తాను నిలబడతారని అన్నారు. ప్రతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కులమతాలకు అతీతంగా చదువుకొని, చదువుతోపాటు సమస్కారం కలిగి ఉండాలని, ఎంత ఎదిగినా గాని సమాజంలో ఒదిగి ఉండాలని అన్నారు.స్వచ్ఛభారత్ లో గ్రామాలలో ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామాలలో మహిళలు బహిర్భూమికి వెళ్లకుండా ప్రతి ఇంట్లోనే మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ఇంటిగ్రేట్ హాస్టల్లో ఏర్పాటు చేయట కొరకు కృషి చేస్తానని,జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కు డైనింగ్ ఆల్ కిచెన్ ఆల్ నిర్మాణానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి, డోకూర్ పవణ్ కుమార్ రెడ్డి, కొండ ప్రశాంత్ రెడ్డి, కొమ్ము భరత్ భూషణ్, దాబా శీను, వనపర్తి శ్రీనివాస్ రెడ్డి, గాయత్రి సత్యం సాగర్, నారాయణమ్మ వెంకట్ రెడ్డి, నరేందర్ గౌడ్,
శ్రీనివాస్ రెడ్డి, రాఘవేంద్రర్ గౌడ్,అమరేందర్ రెడ్డి,
తదితరులు పాల్గొన్నారు.