పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17 2026: బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం కొత్తకోటలోని బీసీ కళాశాల బాలుర వసతి గృహాన్ని విద్యార్థుల విజ్ఞప్తి మేరకు సందర్శించారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ… విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నా… హాస్టల్ గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో శిధిలావస్థలో ఉన్న బీసీ హాస్టల్ భవనం కూల్చి కొత్త భవనం నిర్మించడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు మరియు కాస్మొటిక్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి… బీసీ హాస్టల్ భవనానికి వెంటనే నిధులు మంజూరు చేయించాలని కోరారు. అలాగే కొత్తకోటలో బీసీ బాలికల వసతి గృహం లేక చాలా మంది నిరుపేద విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని, బాలికల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే బాలికల ప్రీ మెట్రిక్ హాస్టల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కృష్ణప్రసాద్, ధర్మేంద్ర సాగర్, యశ్వంత్ గౌడ్, మ్యాదరి రాజు తదితరులు పాల్గొన్నారు.

