– కొత్తకోటతహశీల్దార్ కు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ జి. వామన్ గౌడ్, మాజీ సిడిసి చైర్మన్ భీసం చేన్నకేశవరెడ్డి వినతి పత్రన్ని అందించారు.
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 04. 2026.
భీమా ఎత్తిపోతల పథకం పేస్ 2 లో ఉన్నటువంటి స్టేజ్ 1,2 దగ్గర రెండవ మోటార్ అన్ చేసి కానాయపల్లి చెరువు (శంకరసముద్రం) ఆయకట్టు రైతులకు సాగునీరుఆందించాలని సోమవారం కొత్తకోటతహశీల్దార్ కు వినతి పత్రం న్ని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ జి. వామన్ గౌడ్, మాజీ సిడిసి చైర్మన్ భీసం చేన్నకేశవరెడ్డి తో కలసి కానాయపల్లి చెరువు (శంకర సముద్రం) కింది ఆరు గ్రామాల ఆయకట్టు రైతులతో కలిసి కొత్తకోట మండలం తహశీల్దార్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా బిఆర్ ఎస్ మాజీ వైస్ చైర్మన్ గుండ్రాతి వామన్ గౌడ్ , ఉమ్మడి పాలమూరు జిల్లా సిడిసి మాజీ చైర్మన్ భీసం చేన్నకేశవరెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరదలు వస్తున్న కారణంగా రామన్,పాడ్,ప్రాజెక్టుపూర్తిస్థాయిలోనిండిఉంది.శంకరసముద్రమునకుభీమాస్టేజ్1,స్టేజ్2.నుండిమోటారుప్రారంభం చేసినారు. కావున ఆ గ్రామ రైతులకు 19 ప్యాకేజీ దగ్గర రైతులకు సాగునీరు వదలగలరు. అదేవిధంగా భీమా స్టేజ్ 1, భీమా స్టేజ్ 2 దగ్గర కూడా రెండవ మోటార్ ప్రారంభించగలరు అని నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వగలరని వినతి పత్రంలో కోరారు.అదేవిధంగా వర్షాలు సరైన సమయంలో కురువనందున ఆరుతడి పంటలకు నీరు లేక చాలా ఇబ్బందిగా ఉన్నది.కావున మాపై దయవుంచి శంకరసముద్రం ఆయకట్టు గ్రామాలు కానాయపల్లి, నిర్వేన్, పాలెం, రామనాథపురం, అగ్రహారం, కొత్తకోట, దంతనూరు గ్రామ రైతులు కోరారు.భీమాస్టేజ్1.స్టేజ్2.దగ్గరరెండవమోటార్,ప్రారంభించాడానికిఅవకాశంఉన్నకూడాప్రారంభించట్లేదు.మాపై దయవుంచి రెండవ మోటార్ కూడా ప్రారంభించి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు చేరే విధంగా రైతులను ఆదుకోవాలని ఈసందర్భంగా కొత్తకోట మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందించి కోరారు. ఈ కార్యక్రమంలో నారామన్ అయ్యన్న,లాయర్ యాదగిరి,జలంధర్ రెడ్డి, కొత్తకోట మాజీ వార్డు సభ్యులు రాజు కూమార్ రెడ్డి, వేముల జనార్ధన్ రెడ్డి,వహిద్,బాబా,యన్. మోహన్ రెడ్డి, వహిద్, తాహిర్ ,తంగల్,నాగరాజు,పయాజ్ , మహేష్, వికాస్,రాజ్ కుమార్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
