POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 7:43 pm Posted by : POLITICAL POWER

మండల స్థాయి క్రీడల్లో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థుల ప్రతిభ

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, సెప్టెంబర్ 18: అశ్వారావుపేటలో 17-09-2026న నిర్వహించిన మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. క్రీడా విభాగంలో జూనియర్ స్థాయి కబడ్డీలో ప్రథమ బహుమతి, కోకోలో ప్రథమ బహుమతి, సీనియర్ స్థాయి కోకోలో ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే అథ్లెటిక్స్ విభాగంలో జూనియర్ స్థాయి షాట్‌పుట్‌లో ప్రథమ, ద్వితీయ బహుమతులను విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఈ క్రీడా పోటీల్లో పాఠశాల తరఫున మొత్తం 55 మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన 21 మంది విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపిక కావడం విశేషం. సీనియర్ విభాగంలో వాలీబాల్‌కు నాగ లక్ష్మణ్, ధనుష్, నవనీత్, కబడ్డీకి మైఖేల్, జయప్రకాష్, మల్లేష్, కోకోకు అశోక్, సన్నీ, ప్రశాంత్, సాత్విక్ ఎంపికయ్యారు. జూనియర్ విభాగంలో వాలీబాల్‌కు రిషి, లక్ష్మణ్ గౌడ్, కబడ్డీకి సాయి చరణ్, లోహిత్, జస్వంత్, వీరేంద్ర, కోకోకు టి. జస్వంత్, ప్రవీణ్, సిహెచ్. జస్వంత్, అరుణోదయ్, నాగబాబు జోనల్ స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులు మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జోనల్ స్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ. రేణుక రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మణ్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. జోనల్ స్థాయిలో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.