POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 3:32 pm Posted by : POLITICAL POWER

మద్దిగట్ల పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం

ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓ ఎస్. మంజులత, కాంప్లెక్స్ హెచ్ఎం ఎస్. వరప్రసాద్ రావు

నూతన విద్యార్థులకు పలకలు, నోటు పుస్తకాల పంపిణీ

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17 2026: పెద్దమందడి మండలం మదిగట్ల స్థానిక ప్రాథమిక పాఠశాల మద్దిగట్ల నందు శతాబ్ది వేడుకలను తలపించేలా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమము అత్యంత ఘనంగా నిర్వహించబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజ్, ఉపాధ్యాయులు బి. రమేష్, ఏ. విష్ణు ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి ఎస్. మంజులత, పాఠశాల సముదాయ (కాంప్లెక్స్) గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు హాజరయ్యారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభం, ముందుగా సరస్వతి మాత చిత్రపటానికి మండల విద్యాధికారి మంజులత పూలమాలలు వేసి, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థిని విద్యార్థులకు పలక, బలపాలను బహుమతిగా అందించి, వారితో అక్షరాలు దిద్దించి అక్షరాభ్యాస మహోత్సవాన్ని జరిపారు. పాఠశాల విద్యార్థులందరూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎంఈఓ మంజులత

ఈ సందర్భంగా మండల విద్యాధికారి మంజులత మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల అత్యాధునిక వసతులను, నాణ్యమైన విద్యను అందిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే..

పాఠశాల సముదాయ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ… “దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుంది” అన్న కోఠారి కమిషన్ సూక్తిని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, కావున లభించే అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

డిజిటల్ బోధనతో మెరుగైన విద్య

పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజ్ మాట్లాడుతూ… తమ పాఠశాలలో విద్యార్థులకు సాంప్రదాయ బోధనతో పాటు డిజిటల్ తరగతుల (Digital Classes) ద్వారా అత్యాధునిక విద్యాబోధన అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

బహుమతుల పంపిణీ

ఈ శుభసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం సమకూర్చిన పలకలు, బలపాలు మరియు నోటు పుస్తకాలను ముఖ్య అతిథి మంజులత చేతుల మీదుగా నూతన విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులందరికీ చాక్లెట్లు పంచారు. ఈ మహోత్సవంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.