పొలిటికల్ పవర్,సెప్టెంబర్ 16: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారంలోని రామాలయం ఆలయం వద్ద శ్రీ గౌరీ గణపతి పూజా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక అలంకరణ చేసి, పూలమాలలు, నోట్ల దండలతో అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రార్థించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.