పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో వెంకటేష్ వేముల ::– మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ బుధవారం ఉదయం పులివెందుల లోని ఆయన క్యాంప్ కార్యాలయం నందు కడప జిల్లా వైఎస్ఆర్సిపి యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ పట్రా ప్రగతి మరియు సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్ 77 వ జయంతి వేడుకలు లో భాగం పులివెందుల లో 2 రోజుల పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ బుధవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కడప జిల్లా వైఎస్ఆర్సిపి యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు, ఆంధ్రప్రదేశ్ పట్రా ప్రగతి మరియు సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా సునీల్ కుమార్ మాట్లాడుతూ… రాబోయే కాలంలో పట్రా కులస్తులకు వైఎస్ఆర్సీపీ పార్టీ లో సముచిత స్థానం కల్పించాలి అని, అలాగే రాబోయే కాలంలో తమ కులం ను దృష్టిలో ఉంచుకొని తమ కులస్తులకు ఎంఎల్ఏ, ఎంపీ లు గా అవకాశం కల్పించాలి అని కోరారు.అంతే కాకుండా పట్రా కులస్తులకు రాబోయే తమ ప్రభుత్వం లో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.అందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత సానుకూలం గా స్పందించినట్లు వారు తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి కి వారు ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు.అలాగే వేముల మండలం లో పార్టీ పరిస్థితులను వివరించారు,కడప జిల్లా లో యువజన విభాగం ఆద్వర్యం లో చేస్తున్న,చేపట్టబోయే కార్యక్రమాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి తెలిపారు.