POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:30 pm Posted by : POLITICAL POWER

విశ్రాంత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 30 2026: పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ విశ్రాంత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బీఎస్ ఎన్ ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) సంస్థలో ముప్పై రెండు సంవత్సరాల పాటు ఉద్యోగ విధులు నిర్వహించి సోమవారం నాడు పదవి విరమణ చెంధిన తలారి వెంకటస్వామిని వనపర్తి మైస్ హాల్ జరగినా సమావేశం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంకిత భావంతో ఉద్యోగ విధులు నిర్వహించిన వారు అదే స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలలో, వ్యవసాయ పనులలో నిమగ్నం కావాలని సూచించారు. బీఎస్ ఎన్ ఎల్ లో చక్కని బాధ్యతలు చేపట్టిన వెంకటస్వామి సేవలను నిరంజన్ రెడ్డి కొనియాడారు. వినియోగదారులతో ఆయనకు గల అనుబంధాన్ని కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు పలుస రమేష్ గౌడ్, ప్రేమ నాథ్ రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, జై భీమ్ సేవా సంఘం అధ్యక్షులు బండారు శ్రీనివాస్, వాక్యత్త బైరోజు చంద్రశేఖర్, కవి నిరంజనయ్య