విశ్వ మానవత సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 23:   తూర్పుగోదావరిజిల్లా       బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద విశ్వ మానవత సంస్థ ఆధ్వర్యంలో మానవతా ఆరోగ్య కేంద్రం వారిచే ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన హోమియో వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరాలు, కీళ్ల నొప్పులు, అలర్జీలు,...