POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 6:23 pm Posted by : POLITICAL POWER

వీబీజీ రామ్‌జీ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి

 – అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ సెప్టెంబర్ 10.2026.వీబీజీ రామ్‌జీ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిఅవకాశాలుమౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని,అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు.బుధవారంఅదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యానాయక్,వనపర్తిజిల్లా కొత్తకోట మండలం రాయినిపేట గ్రామపంచాయతీ పరిధిలోచేపడుతున్నవీబీజీరామ్‌జీపనులు,తెలంగాణజలసిరినీటికుంట(ఫార్మ్పాండ్)పనులనుపరిశీలించారు.ఈ సందర్భంగా పనుల పురోగతిని సంబంధిత అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నీటి కుంటల పనులనునిర్దేశితప్రణాళికప్రకారంచేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలనుతప్పనిసరిగా పాటించాలని, పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని అధికారులకుసూచించారు.తెలంగాణ జలసిరి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, రైతులకుసాగునీటి లభ్యతమెరుగుపడేలాఫారంపాండ్లనిర్మాణంచేపడుతున్నట్లుతెలిపారు.ఫారంపాండ్,పనులనునాణ్యతతో పూర్తి చేసి, వాటి ద్వారా రైతులకు గరిష్ట ప్రయోజనం చేకూరేలాచూడాలనిఅధికారులనుఆదేశించారు.వీబీజీ రామ్‌జీ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యతఇవ్వాలనిసూచించారు.సంబంధితఅధికారులు క్షేత్రస్థాయిలో పనులను నిరంతరంపర్యవేక్షిస్తూ, నాణ్యతాప్రమాణాలుపాటించేలాచర్యలుతీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.డి ఆర్ డి ఓ రామ మహేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో వినీత్ తదితరులు ఉన్నారు.