“శిరీష కుటుంబానికి ఆదివాసీ పాస్టర్స్‌ ఐక్య వేదిక అండ”

రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్  పొలిటికల్ పవర్,చౌటిగూడెం, సెప్టెంబర్‌ 7: హైదరాబాద్‌లోని ప్రైమ్‌ కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆదివాసీ యువతి ఊకే శిరీష మృతి పట్ల జాతీయ ఆదివాసీ పాస్టర్స్‌ ఐక్య వేదిక తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామంలోని శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చింది. ఈ సందర్భంగా శిరీష చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుమార్తెను కోల్పోయి తీవ్ర...