పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 19 2026: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీల ముద్దుబిడ్డగా పేరుగాంచిన సరిత తిరుపతయ్య ఇటీవల తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ మదనాపూర్ మండల అధ్యక్షులు బి. మహేందర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేసిన మహేందర్ నాయుడు, బీసీ వర్గాల అభ్యున్నతికి ఆమె సేవలు మరింతగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పశుసంవర్థక రంగ అభివృద్ధికి సరిత తిరుపతయ్య నాయకత్వం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.