ప్లానింగ్ కమిషన్, కుడా చైర్మన్ పదవుల నియామకంపై కాంగ్రెస్లో రచ్చ
పొలిటికల్ పవర్ సమకర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చిన వారికి కీలక పదవులు ఎలా ఇస్తారంటూ అసంతృప్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండడంతో అసంతృప్తిలో ఆశావహులు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా గద్వాల విజయలక్ష్మి, కుడా చైర్మన్గా గుండు సుధారాణిల నియామకాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఓ ముఖ్యనేత ఇప్పటికే గద్వాల విజయలక్ష్మి తండ్రి కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా ఉండగా.. ఒకే ఇంట్లో ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా ఇస్తారని ముఖ్య నేత ప్రశ్న కుమార్తె చేసిన దానికి కొండా సురేఖను బలిచేశారు పార్టీలో ఎన్నేళ్లు పనిచేశారని గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదా, కేబినెట్ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించారు? అని ప్రశ్నించిన పాలమూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటూ సురేఖ కుమార్తె సుస్మిత మాట్లాడింది ఇదే.. పంతాలకు పోయి పార్టీని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు అంటూ మండిపడిన సదరు ఎమ్మెల్యే సురేఖ పోయి సుధారాణి వచ్చింది కానీ తమ పరిస్థితి ఏంటని మండిపడుతున్న వరంగల్ నేతలు