POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 8:01 pm Posted by : POLITICAL POWER

సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

  ఖమ్మం నగర గుట్ల బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో 32 సంవత్సరం తర్వాత పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న స్కూల్ నందు అప్పటి విద్య నేర్పిన గురువులను ఆహ్వానించి వారి సమక్షంలో ఆత్మీయ సమ్మేళన నిర్వహించడం జరిగింది అలనాటి ఉపాధ్యాయులు బాల భారతి టీచర్ , సరోజినీ దేవి , రాజ్యలక్ష్మి , శశికళ , దుర్గాంబ టీచర్ , పిటి సార్ రమణ మరియు ఇప్పటి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు జూలేటి మేడం తదితరులు పాల్గొని మాట్లాడుతూ…… 

    మా ద్వారా చదువు నేర్చుకున్న విద్యార్థులు వివిధ రాష్ట్రాలలో మరియు వేరువేరు దేశాలలో స్థిరపడి ఉన్నత స్థాయిలో ఉండి మమ్మల్ని గుర్తుంచుకొని మా దగ్గర కి వచ్చి మేము చెప్పిన బోధనల ద్వారా ఉన్నత ఉద్యోగాలు ఉన్నత వ్యాపారాలు ఉన్నత స్థాయిలో స్థిరపడం అని తెలియపరిచినప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది భగవంతుడు మాకు ఉపాధ్యాయ వృత్తి ఇచ్చి మా ద్వారా ఎంతో మంది విద్యార్థులు సమ సమాజంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దే అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము అని అన్నారు. 1989 – 1999 వ సంవత్సరం సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని స్థానికంగా ఉంటున్న 

మాతంగి అనిల్ కుమార్ ( జోగయ్య ) , ఉష , శేఖర్ , సత్యవేణి , పని కుమార్ , శ్రావ్య, విజయ , క్రాంతి, శరత్ తదితరులు కార్యక్రమంను బాధ్యత తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది . పూర్వ విద్యార్థులలో సౌజన్య ప్రభుత్వ పాఠశాల నందు ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారని తనకు తాను పరిచయం చేసుకున్న సందర్భంలో గత ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తపరిచినారు 

 అలాగే పని కుమార్ ఖమ్మం కార్పొరేషన్ నందు ఏఈగా ఉద్యోగం చేస్తున్నాడు విజయ చర్ల ప్రభుత్వ కాలేజీ నందు లెక్చరర్ గా వ్యవహరిస్తున్నారు సరోజినీ ప్రభుత్వ ఉద్యోగం శేఖర్ సెంటర్ గవర్నమెంట్ రైల్వే నందు జాబు క్రాంతి ప్రైవేట్ కంపెనీ సీఈవోగా శరత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కోటేశ్వరి వీఆర్వో గా శ్రావ్య SBI బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ పూణే నందు ప్రైవేట్ కంపెనీ సీనియర్ మేనేజర్ గా సిహెచ్ రాజేష్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఏరియల్ మేనేజర్ సుధీర్ , ఖమ్మం నయా బజార్ కాలేజీ నందు క్లర్క్ గా జిలాని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పటల్ నందు ల్యాబ్ టెక్నీషియన్ గా విజయ రాణి ప్రభుత్వ టీచర్ గా డి సునీత రియల్ ఎస్టేట్ ఉషా హెల్త్ ఫైనాన్సు విభాగం నందు పి.విజయలక్ష్మి వ్యాపారం రంగంలో మాతంగి అనిల్ కుమార్ ( జోగయ్య ) ఖమ్మం ప్రభుత్వ ఆస్పటల్ నందు శానిటేషన్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ గా హైదరాబాద్ నందు శైలజ ఎన్జీవో ట్రస్ట్ అసిస్టెంట్ మేనేజర్ గా ఇందిర ప్రియ నర్సింగ్ డిపార్ట్మెంటు నందు ప్రవీణ ప్రైవేట్ జాబు ఇలా తమ తమ వివరాలు వేదిక వద్ద తెలియపరిచినప్పుడు వారికి విద్య నేర్పిన గురువులు ఆనందంతో వారిని ఆశీర్వదించడం జరిగింది . 

ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హిమబిందు,నాగలక్ష్మి సాహెబ్ రామారావు,రాజేష్ రవి కిరణ్ కలీం బేగ్,భారతి, విక్రాంత్,వినీత్,అంజి, సిహెచ్ రామకృష్ణ, చంద్రశేఖర్, తదితర విద్యార్థులు విద్యార్థినులు పాల్గొనడం జరిగింది.