POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 2:00 pm Posted by : POLITICAL POWER

హైకోర్టుకు చేరిన యాదాద్రి దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వ్యవహారం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 05 2026: ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, బోర్డ్ చైర్మన్ సభ్యులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు యాదాద్రి దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 392ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నాగిళ్ల శ్రీనివాస్, వ్యవస్థాపక ట్రస్టీ భాస్కరయాని నరసింహమూర్తి అనే ఇద్దరు వ్యక్తులు రాజ్యాంగంలోని 24, 25 సవరణల ప్రకారం ఆలయ బోర్డులో ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వకూడదని కోర్టుకు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది దీంతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ఆలయ ఈవో, చైర్మన్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అర్చకులను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు