రెబ్బనపల్లి గ్రామంలో బడి బాట కార్యక్రమం
ఉపాధి హామీ పని దగ్గర బడి బాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు
జూన్ 12 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామం లోని ఉపాధి హామీ పని దగ్గర బడి బాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన హై స్కూల్ లో మండలం లో ఏ స్కూల్ లో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని దూర ప్రాంత విద్యార్థులకు సైకిల్స్ అందజేస్తూ నిరుపేద విద్యార్థులకు బిగ్ హెల్ప్ ఫౌండేషన్ తరుపున సహాయ సహకారాలు అందిస్తు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం విద్యార్థులకు పొద్దుట టిఫిన్లు ఏర్పాటు చేస్తూ రుచికరమైన మధ్యాన భోజనం తో పాటు స్నాక్స్ అందజేస్తూ అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పిస్తూ మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు మంత్రి రాజు ఆధ్వర్యంలో ప్రతి సబ్జెక్టు కు ఇద్దరు చొప్పున ఎంతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం చే విద్యానందిస్తూ కంప్యూటర్స్ సదుపాయం తో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తూ మంచి ఫలితాలను రాబడుతూ మండలం లోనే మంచి ఉత్తీర్ణత శాతం సాధిస్తుందని ప్రతి తల్లితండ్రులు ఎంతో కష్టపడుతూ సంపాదించిన డబ్బులు ప్రైవేట్ స్కూల్స్ లో పెట్టకుండా పూర్తిగా ఉచితంగా విద్యానందించే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామస్్తులు పాల్గొన్నారు.
