పీ సీ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ.
జూలై 3 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి
జన్నారం : మండలంలోని పొనకల్ గ్రామ పరిధిలోని చెరుకుగూడెం గ్రామంలో ప్రైమరీ స్కూలు లోని విద్యార్థులకు పీ సీ ఆర్ ( పూర్ణచందర్రావు)ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మాట్లాడుతూ చెరుకుగూడెం ప్రైమరీ స్కూల్ అంగన్వాడీలో 20 మంది విద్యార్థులకు, ఫౌండేషన్ ద్వారా బ్యాగులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పొనకల్ వార్డు సభ్యుడు చెరుకు రాజ్ కుమార్ , పిసిఆర్ ఫౌండేషన్ సభ్యులు చింతల సతీష్ తదితరులు లు పాల్గొన్నారు.