ఫిజియోథెరపీ డాక్టర్ గా చెలమని అవుతున్న విజయ్.
ఆగస్టు 8 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మండలం లో ఓ ఫిజియోథెరపీ క్లినిక్ ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు శుక్రవారం క్లినిక్ ను తనిఖీ చేశారు.రోగి ఫిర్యాదు మేరకు క్లినిక్ ను పరిశీలించగా,ఇంటర్ మాత్రమే చదివిన విజయ్ కుమార్ డాక్టర్ గా చలామణి అవుతున్నట్లు తెలిసింది. ఫిజియోథెరపీ పేరుతో రోగులకు ఇంజక్షన్లు మందులు ఇస్తూ అధికారికంగా చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ కౌన్సిల్ సభ్యులు డా.సంతోష్, అనిల్ గుర్తించి వెల్లడించారు.