దండేపల్లి మండలం విద్యుత్ షాక్ తో జూనియర్ లైన్మెన్ కు గాయాలు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్  మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం మోకాసిగూడ స్టేజి వద్ద విద్యుత్ పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ గురై స్తంభం పై నుండి కింద పడిన జూనియర్ లైన్మెన్ మహేందర్ ,తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.