*BRS పార్టీ మహిళా ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారిపై జరిగిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం – బానోత్ మనీషా లక్ష్మీ మదన్ లాల్*
BRS పార్టీ ఎమ్మెల్యే *శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారిపై* జరిగిన అవమానకర వ్యవహారంపై *వైరా నియోజకవర్గ BRS పార్టీ నాయకురాలు శ్రీమతి బానోత్ మనీషా లక్ష్మీ మదన్ లాల్ గారు* తీవ్రంగా మండిపడ్డారు.
మహిళా ప్రజా ప్రతినిధిపై ఇలాంటి దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
*కాంగ్రెస్ పార్టీ ఆగడాలకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని*, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.