అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలైన వారికి మిగులు భోజనం అందించారు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, బి యస్ నారాయణరెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణమునందు బేస్తవారం రోజు రాత్రి గణపతి ఉత్సవాలలో భాగంగా గ్రామ గ్రామాన భోజనాలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిన విషయమే ఇందులో మిగులు భోజనము కొత్తపల్లె గ్రామంలోని శ్రీరామ యూత్ సహకారముతో పులగం పచ్చడి స్థానిక కుమ్మరాం కట్ట వినాయక యూత్ సహకారంతో పెరుగన్నం జిలకర అన్నం గిద్దలూరు రైల్వే స్టేషన్ ఆవరణము నందు బాటసారులకు రైలు ప్రయాణికులకు అందించడం జరిగింది మా మీద నమ్మకంతో వారు అల్పాహారాన్ని మాదగ్గరికి అందచేసినందుకు వారందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు,ఏరువ రమణారెడ్డి సామాజిక కార్యకర్త తెలిపారు. యువత వచ్చి అయిపోయేంతవరకు మాకు తోడుగా నిలిచారు వారికి ధన్యవాదములు మిగిలిన భోజనం వృధా కాకుండా పదిమందికి ఆకలి నింపడం మహా పుణ్యఫలం భాగ్యమైనటువంటి కార్యక్రమము అని తెలిపారు. ఎటువంటి శుభకార్యాలలో భోజనం మిగిలిన ఆహారాన్ని దుబారా చేయకుండా మాకు తెలియచేస్తే అందుబాటులో ఉంటే తప్పకుండా రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి పోయే బాటసారులకు ప్రయాణికులకు ఉపయోగించడానికి తోడ్పడతామని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు. ఎటువంటి శుభకార్యాలలో అయినా మిగులు భోజనాలు ఉన్నట్లయితే 9441932390, 9959760906 నెంబర్ లను సంప్రదించాలని బి యస్ నారాయణరెడ్డి కోరారు.