POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 9:42 pm Posted by : POLITICAL POWER

5మీడియా అక్రెడిటేషన్ కమిటీలో…  *టీడబ్ల్యూజేఎఫ్ కు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం*

5మీడియా అక్రెడిటేషన్ కమిటీలో…

*టీడబ్ల్యూజేఎఫ్ కు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం*

*-కోర్టు దిక్కరణగా పరిగణించాల్సివస్తుందని వ్యాఖ్య*

 

మే 1

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

హైదరాబాద్,మహానది న్యూస్, మే 01: మీడియా అక్రెడిటేషన్ కమిటీ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్

(టీడబ్ల్యూజేఎఫ్) యూనియన్ కు ప్రాతినిధ్యం కల్పించక

పోవడంపై ఆ సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య

హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సింగిల్ బెంచి విచారణ జరిపింది. ఈ విచారణ సందర్బంగా ప్రభుత్వ న్యాయవాదుల వాదనలు, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న తర్వాత సింగిల్ బెంచి న్యాయమూర్తి జస్టీస్

రేణుక యార తీవ్రంగా స్పందించి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో పిటిషనర్ మామిడి సోమయ్య ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్ కు దాఖలు చేసుకున్న దరఖాస్తును అమలు చేయకపోడం, ప్రభుత్వ న్యాయవాదులు కౌంటర్ ఫైల్ చేయకపోడం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 20న పిటిషనర్ సమర్పించిన రీప్రజెంటేషన్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో, తీసుకున్న చర్యల పై ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ఎటువంటి నివేదిక సమర్పించారో తెలియజేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ వ్యాజ్యన్ని తదుపరి విచారణకు వాయిదా వేశారు. అదేవిధంగా

మార్చి 26న కోర్టు

జారీ చేసిన ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేసి నివేదిక(compliance report)ను కోర్టుకు సమర్పించాలని జస్టీస్ రేణుక యారా ప్రతివాదులను ఆదేశించడం జరిగింది.

కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాదులను వ్యాఖ్యానిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.