POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 7:11 pm Posted by : POLITICAL POWER

పెద్దమందడి సింగిల్ విండో సీఈఓ జగదీశ్వర్ రెడ్డిని సన్మానించిన వెల్టూర్ నాయకులు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026:
వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈఓ జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా వెల్టూర్ గ్రామ నాయకులు పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు. శనివారం నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమంలో వెల్టూర్ గ్రామానికి చెందిన నాయకులు, రైతులు కలిసి జగదీశ్వర్ రెడ్డికి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యోగ జీవితంలో రైతులకు అందుబాటులో ఉంటూ నిజాయితీ, క్రమశిక్షణతో సేవలందించారని కొనియాడారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, సహనంతో వ్యవహరించిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. సింగిల్ విండో ద్వారా రైతులకు అవసరమైన సేవలు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని వెల్టూర్ గ్రామ నాయకులు ఆకాంక్షించారు.తమకు ఎల్లప్పుడూ సహకరించిన జగదీశ్వర్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సి. వెంకటేశ్వర్లు, రఘువర్ధన్ రెడ్డి, బుసయ్య, రవీందర్, చిత్తూరు కృష్ణారెడ్డి, కుమ్మరి కొండన్న, నాగరాజుగౌడ్, మెరుగు కుర్మయ్య, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.