మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా గోవధ జరిగినట్టు సమాచారం
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ 04 మే 2026: వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు, మతపరమైన భావాలు దెబ్బతినే విధంగా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం అత్యంత విచారకరం. హిందూ ధర్మం, సనాతన సంప్రదాయాల పరిరక్షణ గురించి పెద్దఎత్తున మాట్లాడే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీజేపీ, ఈ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఉంది. గోవధకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇటువంటి ఘటనలపై కొందరు నాయకులు మౌనం పాటించడం లేదా ప్రత్యక్షంగా/పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే గుసగుసలు వినిపించడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నాము. అలాగే, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రామీణ శాంతి, సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. రాజకీయాలకు అతీతంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం సమాజానికి అవసరం