Date of Publish : 07 May 2026, 4:09 pmPosted by : POLITICAL POWER
ఈరోజు అనగా తేదీ 07.05.2026 ఉదయం 10:00 గంటలకు రైతు వారోత్సవాలను పురస్కరించుకొని వెంకట్రావుపేట రైతు వేదికలో రైతులకు నియోజకవర్గస్థాయి మీటింగ్లో భాగంగా పిఎం కుసుం (PM KUSUM) మరియు వ్యవసాయంలో డ్రోన్ల యొక్క ప్రాముఖ్యతపై వివరించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు, మంచిర్యాల ఎం. కృష్ణ మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం, డి ఇ మరియు ఏడిఈ టిఎస్ ఎన్పీడీసీఎల్, టీఎస్ రెడ్ కో జిల్లా మేనేజర్, డివిజన్ కి సంబంధించిన మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఆర్టిఏ మెంబర్ శ్రీనివాస్ మరియు గ్రామ సర్పంచ్ నలిమెల రాజు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.