పెంటన్న యాదవ్ను పరామర్శించిన డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంటన్న యాదవ్ను తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో వైద్యులను కలిసి పెంటన్న ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. పార్టీ నాయకుడి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెంటన్న యాదవ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.