POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 6:46 pm Posted by : POLITICAL POWER

సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారురాలి ఇంటికే అందజేసిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ.. కాశి నాయన మే 9 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ప్రసాదరావు. కలసపాడు కడప జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదవాడి పెన్నిధి అని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అన్నారు. శనివారం కాశినాయన మండలం ఉప్పులూరు గ్రామంలో అనారోగ్యంతో చికిత్స పొంది మృతి చెందిన లక్ష్మీ ప్రసన్న కుమారుడు కి మంజూరైన రూ.66,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును నేరుగా ఇంటికి వెళ్లి అందజేశారు.

 

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. గతంలో చెక్కుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి భిన్నంగా నేడు పారదర్శక పాలనతో లబ్ధిదారుల ఇంటికే సాయం చేరుతోందన్నారు. ఆరోగ్యశ్రీలో కవర్ కాని కేసులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా తక్షణ సాయం అందిస్తున్నామని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

 

కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ గురువి రెడ్డి, మాజీ ఎంపీటీసీ పోలిరెడ్డి, టీడీపీ నేతలు విజయ్ కుమార్ రెడ్డి, దుగ్గిరెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.